మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ లో చెప్పారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించేందుకు కోవిడ్ టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందన్నారు. తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు కానీ.. వెంటనే హోం క్వారంటైన్ లో ఉన్నానన్నారు. గత ఐదు రోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టు చేయించుకోవాల్సిందిగా కోరారు. తన ఆరోగ్యం పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తానన్నారు.
అయితే రెండు రోజుల క్రితం (నవంబర్ 7) చిరంజీవి,నాగార్జున ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి- విస్తరణపై చర్చ జరిగింది. ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020