సోషల్ మీడియాలో ట్రోలింగ్.. భరించలేక విద్యార్థి ఆత్మహత్య

సోషల్  మీడియాలో ట్రోలింగ్.. భరించలేక విద్యార్థి ఆత్మహత్య

పణజి: రోడ్డు పక్కన చెత్త వేస్తున్న వీడియో సోషల్​మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ కావడం, నెటిజన్ల ట్రోలింగ్​తో మనస్తాపానికి గురైన ఓ 23 ఏళ్ల కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం గోవాలోని మాపుసా ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న శామ్యూల్ డి బ్రగాంజా.. తల్లి, ఇద్దరు సోదరిలతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల అతడు రోడ్డు పక్కన చెత్త వేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ వీడియో ఆధారంగా స్థానిక పోలీసులు శామ్యూల్‌‌‌‌‌‌‌‌పై కేసు పెట్టి, విచారణకు రమ్మంటూ నోటీసులు జారీ చేశారు. అతడు స్టేషన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి విచారణకు సహకరించాడు. అయితే నెట్టింట సాగుతున్న ట్రోలింగ్, విమర్శల కారణంగా అతడు మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఇంట్లోని లైసెన్స్​డ్ ​తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.