మహమ్మారి కరోనా వ్యాప్తి రోజు రోజుకు ఉద్ధృతమవుతోంది. ఈ వైరస్ దాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అలాగే ఇవాళ(25వ తేది) తమిళనాడులో ఒకరు, బెంగళూరులో ఒకరు కరోనాతో చనిపోయారు. దీంతో ఇండియాలో కరోనా మృతుల సంఖ్య 11కి చేరగా..పాజిటివ్ కేసుల సంఖ్య 584 కు చేరింది.
అత్యధికంగా మహారాష్ట్రలో 112 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో కేరళలో 109 పాజిటివ్ కేసులు,కర్ణాటక 41, తెలంగాణ 39,గుజరాత్ లో 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.