గోవుల అక్రమ రవాణా..ఇద్దరు అరెస్ట్

గోవుల అక్రమ రవాణా..ఇద్దరు అరెస్ట్

మేడ్చల్ జిల్లా : ఘట్కేసర్ ఔటర్  టోల్ గెట్ దగ్గర 50 గోవులతో వెళ్తున్న డీసీఎం కంటైనర్ పట్టుకున్నారు గోరక్షణ కార్యకర్తలు. ఒరిస్సా నుండి హైదరాబాద్ లోని బహదూర్ పూర్ కి తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. డ్రైవర్ ఖలిద్, సకుల్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఘట్కేసర్ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో గోవుల కంటైనర్ ని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. గోవులను చల్లుర్ గోమాత సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు పోలీసులు.