అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాలు అరెస్ట్

అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాలు అరెస్ట్

రెండు అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేశామని తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.  వారి నుంచి 3.5 లీటర్ల హాశిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామని..దీని విలువ 25 లక్షలు రూపాయలు ఉండొచ్చని చెప్పారు.ప్రధాన నిందితుడు సంపత్ కిరణ్ కుమార్ అలియాస్ జాన్ నుండి ఒక లీటర్  హాశిష్ ఆయిల్ సీజ్ చేశామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పాడేరు లో ఉన్న కొంత మంది డీలర్ల సహాయంతో గంజాయి నుండి హాశిష్ ఆయిల్ తీసి అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. ఒక గ్రామ్ హశిష్ ఆయిల్ రూ.700 నుండి వేయి రూపాయలు వరకు అమ్ముతున్నారని చెప్పారు.

వెస్ట్ జోన్ లో మరో డ్రగ్స్ కేసు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు సీపీ అంజనీ కుమార్. 2 లీటర్ల హాశిష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. పాడేరుకు చెందిన గౌతమ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పరారీ లో ఉన్న మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. దీంతో పాటు ఇయర్ ఎండింగ్ కార్యకలాపాలు పై నిఘా పెట్టామన్నారు. పబ్స్ లో మైనర్లు కు మద్యం అమ్మితే కట్టిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. పిల్లలపై కూడా తల్లి దండ్రులు నిఘా పెట్టాలని సూచించారు. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా కొనసాగుతాయని..మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కేసులు నమోదు చేస్తామని స్ఫష్టం చేశారు సీపీ అంజనీ కుమార్.