పోలీస్ స్టేషన్లను..సీపీ ఆకస్మిక తనిఖీ

పోలీస్ స్టేషన్లను..సీపీ ఆకస్మిక తనిఖీ

దుబ్బాక, వెలుగు : దుబ్బాక సర్కిల్ లోని దుబ్బాక, భూంపల్లి, మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లను బుధవారం సీపీ అనురాధ ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్లలో రికార్డులు తనిఖీ చేసి, ఆయా కేసుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పార్లమెంట్​ఎన్నికల నేపథ్యలో పోలీసులు అలర్ట్​గా ఉండాలన్నారు.

మద్యం, నగదు రవాణపై నిఘా పెట్టాలని సూచించారు. విలేజ్​లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని తెలిపారు. గంజాయి లాంటి మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు గంగరాజు, రవికాంత్, పరశురాం పాల్గొన్నారు.