హైదరాబాద్‌లో గణేశ్ మండపాల వద్ద సీపీ తనిఖీ

హైదరాబాద్‌లో గణేశ్ మండపాల వద్ద సీపీ తనిఖీ

జూబ్లీహిల్స్​/ మెహిదీపట్నం, వెలుగు: బోరబండ, రహ్మత్​నగర్, బంజారాహిల్స్, లంగర్​హౌస్​ లోని ముఖ్యమైన గణేశ్​మండపాల వద్ద సిటీ సీపీ సీవీ ఆనంద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండపాల నిర్వాహకులు, వలంటీర్లతో మాట్లాడారు. మండపాల వద్ద భద్రతను పరిశీలించి సూచనలు ఇచ్చారు. వర్షాలు పడుతున్నందున మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వెస్ట్​ జోన్​డీసీపీ విజయ్​కుమార్, ఎస్బీ డీసీపీ అపూర్వా రావు, ట్రాఫిక్​ డీసీపీ రాహుల్​ హెగ్డే పాల్గొన్నారు.