జనవరి 16న చేపట్టనున్న సమ్మెకు సీపీఐ మద్దతు

జనవరి 16న చేపట్టనున్న సమ్మెకు  సీపీఐ మద్దతు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర కార్మిక, సంయుక్త్​ కిసాన్​ మోర్చా ఈ నెల 16న తలపెట్టిన సమ్మె, గ్రామీణ బంద్​కు సీపీఐ మద్దతు ప్రకటించింది. శనివారం హైదరాబాద్​లో నిర్వహించిన సీపీఐ జాతీయ కౌన్సిల్​సమావేశంలో ఈమేరకు నేతలు తీర్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని నేతలు విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​ప్రజలకు నిరాశ కలిగించిందన్నారు.

ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ తీర్మానం చేశారు. కమిటీ సభ్యులుగా డి.రాజా, కె. నా రాయణ, రామకృష్ణ పాండాను నియమించారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, నాయకులు పాల్గొన్నారు.