ఖమ్మంలో  మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరికలు

ఖమ్మంలో  మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరికలు

ఖమ్మం రూరల్, వెలుగు :  మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్​పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో మంగళవారం పలువురు సీపీఐ నాయకులు కాంగ్రెస్​లో చేరారు. 27 డివిజన్​ నుంచి సీపీఐ సీనియర్ నాయకులు గణపారపు వీరయ్యతోపాటు మధు, 20 మంది నాయకులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్​తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరినవారికి కాంగ్రెస్​ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఏదులాపురం తాల్లేసి తండా 24వ డివిజన్ లో సీపీఐ సీనియర్ నాయకుడు కృష్ణ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.