- మంత్రి ఉత్తమ్ కు సీపీఐ లెటర్
హైదరాబాద్, వెలుగు: శ్రీరాంసాగర్ వరద కాలువలో భాగంగా గౌరవెల్లి రిజర్వాయర్, కెనాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి కోరారు. వెంటనే నిధులను మంజూరు చేయాలని శుక్రవారం ఆయన మంత్రి ఉత్తమ్ కు లేఖ రాశారు. పనులు పూర్తి చేసి వానాకాలంలోపైనా నీళ్లు నిల్వ చేయాలన్నారు.