జూబ్లీహిల్స్ పబ్కేసు సీబీఐకి అప్పగించాలి

జూబ్లీహిల్స్ పబ్కేసు సీబీఐకి అప్పగించాలి

జూబ్లీహిల్స్ బాలిక కేసును సీబీఐకి అప్పగించాలని సీపీఐ జాతీయ నేత నారాయణ  డిమాండ్ చేశారు. పబ్ లోకి మైనర్లను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. అమ్నీషియా పబ్ సీజ్ చేసి.. నిర్వాహకులను అరెస్ట్ చేయాలన్నారు. పబ్ నిర్వాహకుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన అధికారుల పిల్లలు ఉన్నారన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వారి మనుషుల్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ను డిస్ మిస్ చేయాలన్నారు.