
ముషీరాబాద్, వెలుగు: గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. నిరుద్యోగ జేఏసీ జులై 4న తలపెట్టిన చలో సెక్రటేరియట్ పోస్టర్ను గురువారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీజీలు, పీహెచ్డీలు చేసిన యువత ఆటోలు నడుపుకుంటూ, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ బతుకులు వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీవైఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావిద్, జేఏసీ నేతలు సుధీర్, సింధూరెడ్డి, ఖాసీం, నర్సింహ పాల్గొన్నారు.