చట్టసభల్లో వామపక్షాలు లేని లోటు కనిపిస్తుంది

చట్టసభల్లో వామపక్షాలు లేని లోటు కనిపిస్తుంది

చట్టసభల్లో వామపక్షాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు సీపీఐ, సీపీఎం నేతలు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించేవారే కరువయ్యారన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. BJP, TRS డిల్లీలో దోస్తాన చేస్తూ గల్లీలో కొట్లాడుకుంటున్నాయన్నారు. మోడీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. వరంగల్ లో బైక్ ర్యాలీ నిర్వహించాయి వామపక్ష పార్టీలు.