కలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా సీపీఎం నాయకుల ధర్నా

కలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా సీపీఎం నాయకుల ధర్నా

జనగామ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిచాలంటూ సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. అయితే వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన సీపీఎం నాయకులపై కలెక్టర్ మండిపడ్డారు. సీపీఎం నాయకులు ఫోటోల కోసం మాత్రమే హంగామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ శివలింగయ్యకు సీపీఎం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. 

సీపీఎం నాయకులను పోలీసులు కలెక్టర్ ఛాంబర్ ను బయటికి పంపించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న తమపై కలెక్టర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వెంటనే కలెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేశారు. కలెక్టర్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా బయట ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.