కేసీఆర్‌తో దోస్తీ చేస్తూనే సమస్యలపై పోరాడుతాం

కేసీఆర్‌తో దోస్తీ చేస్తూనే సమస్యలపై పోరాడుతాం

జనగామ, వెలుగు : సీఎం కేసీఆర్​తో దోస్తీ చేస్తూనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం ఆయన జనగామ శివారు బాణాపురంలో డబుల్​ బెడ్​రూం ఇండ్ల వద్ద మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని ఏఏ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలనేది పొత్తు ఖరారు టైంలో నిర్ణయిస్తామన్నారు. జనగామలోని పేదలు ఇండ్లు, ఇండ్ల  స్థలాల కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. పార్టీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్​, పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జోగు ప్రకాశ్​, బూడిద గోపి, రాపర్తి రాజు పాల్గొన్నారు.