మియాపూర్ అపార్ట్ మెంట్ లో క్రికెట్ బెట్టింగ్ : రూ.43 లక్షలు స్వాధీనం

మియాపూర్ అపార్ట్ మెంట్ లో క్రికెట్ బెట్టింగ్ : రూ.43 లక్షలు స్వాధీనం

హైదారాబాద్ నగరంలో బెట్టింగ్ స్థావరాలపై రైడ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. మియాపూర్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాపై మాదాపూర్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు కలిసి రైడ్ చేశారు. ఈ రైడ్ లో భారీగా నగదును అధునాతన పరికరాలను గుర్తించనట్టు తెలుస్తుంది. రైడ్ నిర్వహిస్తున్న వారిలో ముఖ్యమైన వ్యక్తి గుంటూరుకు చెందిన శాఖమురి వెంకటేశ్వర రావుతో పాటు నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

మియాపూర్ లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టిన్ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో రైడ్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి  రూ.43 లక్షల 57 వేల నగదు, 8 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లు, 2 ట్యాబ్ లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులు అధునాతన పరికరాలతో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. 

ఐపీఎల్ 2024 ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద మొత్తంలో నగదు పట్టుపడటం ఇదే మొదటి సారి. బెట్టింగ్ ముఠా పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇంకా ఎక్కడైన స్థావరాలు ఏర్పాటు చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.