
హైదరాబాద్ : నగరంలో ఐపీఎల్ సందడి కనిపిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఏప్రిల్ 2న మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఉదయం నుంచే ఉప్పల్ స్టేడియానికి వెళ్లే ప్రధాన రహదారి అంతా రద్దీగా కనిపిస్తోంది.
స్నేహితులతో, కుటుంబసభ్యులతో కలిసి మ్యాచ్ తిలకించడానికి ఫ్యాన్స్ స్టేడియానికి చేరుకుంటున్నారు. స్టేడియం బయట యువతీ యువకులు విజిల్స్, కేకలతో వాతావరణం ఆహ్లాదంగా మారింది. లైవ్ మ్యాచ్ను తిలకించబోతుండటం ఆనందంగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
రాజస్థాన్పై హైదరాబాద్ టీం గెలుపొందాలని కోరుకుంటున్నారు. గతంలో ఐపీఎల్ లో సన్ రైజర్స్, రాజస్తాన్ జట్ల మధ్య 16 మ్యాచ్లు జరగగా చెరో ఎనిమిది మ్యాచ్ లు గెలిచి సమానంగా ఉన్నాయి.