రిషబ్ పంత్ హెల్త్ అప్డేట్

రిషబ్ పంత్ హెల్త్ అప్డేట్

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రిషబ్ పంత్..కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి ఈ వారంలో డిశ్చార్జ్ కానున్నాడు. డిసెంబర్ 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్.. దాదాపు నెలరోజుల తర్వాత ఇంటికి వెళ్లనున్నాడు. 

న్యూఇయర్ వేడుకల కోసం రిషబ్ పంత్ ఉత్తరాఖండ్లోని తన ఇంటికి డిసెంబర్ 31న వెళ్తుండగా రూర్కెలా సమీపంలో ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో పంత్ కారు పూర్తిగా కాలిపోయింది. అయితే అద్దాలు పగలకొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో పంత్ మోకాలికి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత వేగంగా కోలుకున్న పంత్..ఈ వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయి. పంత్ డిశ్చార్జ్ విషయాన్ని బీసీసీఐ కూడా ధృవీకరించింది. పంత్ వేగంగా కోలుకుంటున్నాడని..వారంలో డిశ్చార్జ్ అవుతాడని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.  ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న రిషబ్ పంత్..వచ్చే నెలలో మళ్లీ హాస్పిటల్కు వెళ్లాల్సి ఉంటుంది. డాక్టర్లు పంత్కు మరో సర్జరీ చేయనున్నారు. అయితే సర్జరీ డేట్ మాత్రం ఇంకా నిర్ణయించలేదు.