
ఒకప్పుడు ప్రేక్షకులకు ఎంటెర్టైన్మెంట్ అంటే కేవలం సినిమాలు మాత్రమే. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని ఓటీటీలు రీప్లేస్ చేస్తున్నాయి. కేవలం సినిమాలే కాకుండా.. వెబ్ సిరీస్ లకు సైతం ఆడియన్స్ బాగా అడిక్ట్ అయ్యారు. అందులోనూ క్రైమ్, థ్రిల్లర్, హారర్ సిరీస్ లవైపు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు ప్రేక్షకులు. ఈ జానర్ లో వచ్చిన సినిమాలు, సిరీస్ లు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి.
ఇపుడు అలాంటి మరో ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీకి రానుంది. అదే బాలీవుడ్ మూవీ భక్షక్(Bhakshak). భూమి పెడ్నేకర్ మెయిన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను పులకిత్ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. దీంతో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లోకి కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానుంది.
లేటెస్ట్గా భక్షక్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ను కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. “ఇది అందరికీ చెప్పాల్సిన స్టోరీ. భక్షక్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు” అని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఏంతో క్యూరియాసిటీగా ప్రతి సీన్ ను కట్ చేసిన విధానం ఆడియన్స్లో హైప్ పెంచుతోంది.
ఇతరులు కష్టాల్లో ఉంటే బాధపడని వాళ్లు మనుషులు ఎలా అవుతారు. భక్షక్లు అవుతారు” అంటూ ట్రైలర్ చివర్లో భూమి చెప్పే డైలాగ్ హైలెట్గా నిలిచింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్(Netflix) లో ఫిబ్రవరి 9నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి థ్రిల్లర్ జానర్ ను ఇష్టపడే ఆడియన్స్..ఫిబ్రవరి 9 నుండి భక్షక్ చూసేయండి.
Insaan ya Bhakshak? Samay aa chuka hai chun ne ka!! #Bhakshak a film inspired by true events coming on 9 February, only on Netflix.#BhakshakOnNetflix pic.twitter.com/u3fYQpSys3
— Netflix India (@NetflixIndia) January 31, 2024
భక్షక్ మూవీలో భూమి పెడ్నేకర్ కీ రోల్ పోషిస్తుండగా ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్హంకర్, రాజ్పాల్ యాదవ్, సూర్య శర్మ మరియు సంజయ్ మిశ్రా కీలక పాత్రలు చేస్తున్నారు. వీరిలో ఆదిత్య శ్రీవాస్తవ హిందీ టీవీ షోలలో సూపర్ సక్సెస్ అయిన సీఐడీలోప్రధాన పాత్ర పోషించారు.