మహిళల వరుస హత్య కేసుల్లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని హైటెక్ కాలనీకి చెందిన గంగమ్మ అన మహిళ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తోంది.
అక్కడే నివసిస్తున్న హీర్య అనే వ్యక్తి పని చూపిస్తానని చెప్పి మహిళను నమ్మబలికాడు. అనంతరం ఆమెను సిటీలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న బంగారం.. వెండి వస్తువులు తీసుకుని పరారయ్యాడు. మరోమహిళను కూడా మాయమాటలు చెప్పి నమ్మించి.. ఏలికట్ట సమీపంలోని వెంచర్లోకి తీసుకెళ్లాడు. ఆమెను కొట్టి వెండి వస్తువులు, నగదు, ఫోన్ తో ఉడాయించాడు.
వరుసగా జరుగుతున్న ఘటనలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సిటీలోని ఓ ప్రాంతంలో అతడు ఉన్నాడన్న సమాచారంతో అతన్ని అరెస్ట్చేసి.. జైలుకు తరలించారు.