
సున్నం చెరువు పరిరక్షణపై హైడ్రా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 30న ఉదయం అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ..సున్నం చెరువులో అక్రమ నీటి దందా చేస్తున్న వారిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేయింది. దశాబ్దాలుగా నీటి దందాను నడిపిస్తున్న వెంకటేష్ తో పాటు మరి కొంత మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నీటి దందా కొనసాగిస్తున్న బోరు వ్యాపారి షెడ్డులో లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుంది.. నీటి ట్యాంకర్లు సీజ్ చేయించింది . బోర్లను, షెడ్డులను తొలగించింది హైడ్రా. వ్యాపారులు ఏర్పాటు చేసిన షెడ్డులను, గుడిసెలను ఖాళీ చేయించి తొలగించింది హైడ్రా.
మొత్తం 32 ఎకరాల మేర విస్తరించి ఉన్న చెరువు పునరుద్ధరణ పనులు చేస్తోంది హైడ్రా. అక్కడ బోరు బావుల నీరు విషతుల్యమని తెలిసినా నీటి వ్యాపారం ఆగడం లేదు. దుర్గంధభరితంగా మారిన సున్నం చెరువు చెంత ఉన్న బోర్లలో ప్రమాదకర రసాయనాలు, భార లోహాలైన సీసం, కాడ్మియం, నికెల్ ఉందని తెలిపింది . PCB ద్వారా పరీక్షలు చేయించిన హైడ్రా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నీటిని తాగునీటిగా హాస్టళ్లు, నివాసాలకు, కార్యాలయాలకు సరఫరా చేయవద్దని హెచ్చరించింది. ఆ నీటిని వాడవద్దని హెచ్చరించినా నీటి దందా ఆపడం లేదు.
కలవరపడాల్సిన విషయం ఏమిటంటే ఈ చెరువు పక్కన మూడు బోర్లు వేసిన ఓ వ్యక్తి ఈ నీళ్లను ట్యాంకర్ల ద్వారా మాదాపూర్లోని పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ హాస్టల్స్, విద్యా సంస్థలు, హోటల్స్ కు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది.
ఇందులో కొందరు ప్రైవేట్ హాస్టల్స్, హోటల్స్ నిర్వాహకులు ఈ నీటిని ప్యూరిఫై చేసి తాగడానికి ఉపయోగిస్తుండగా, ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు ఇతర పనులకు ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఇక్కడి హాస్టల్స్లో వేల మంది స్టూడెంట్స్, జాబర్స్ఉంటున్నారు. ఐటీ కంపెనీల్లో సాఫ్ట్వేర్జాబ్స్చేసేవారితో పాటు ఐఐటీ, మెడికల్కోచింగ్ తీసుకునే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. సున్నం చెరువు నీళ్ల సరఫరా విషయం బయటపడడంతో ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్నది. బోర్లు వేసి నీటి సరఫరా చేస్తున్న వ్యక్తిపై హైడ్రా కేసు నమోదు చేసింది. సున్నం చెరువు పరిధిలో నీటి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంక్ యజమానులపై కేసులు నమోదు చేయించింది హైడ్రా.