BRK భవన్ పనులు పరిశీలించిన సీఎస్ ఎస్కే జోషి

BRK భవన్ పనులు పరిశీలించిన సీఎస్ ఎస్కే జోషి

రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక సెక్రటేరియట్ అయిన BRK భవన్ పనులను పరిశీలించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి. కొత్తగా ఏర్పాటుచేసిన తన ఛాంబర్ ను పరిశీలించారాయన. తన పేషీ సంబంధిత పీఎస్ ల ఛాంబర్ లలోనూ రిపేర్లు చేయాలని సూచించారు సీఎస్.ఆ తర్వాత.. తన క్వార్టర్స్ కుందన్ బాగ్ కు వెళ్లిపోయారాయన.

BRK భవన్ కు ప్రధాన శాఖలు ఇప్పటికే షిఫ్ట్ అయ్యాయి. ఇవ్వాల్టి నుంచి BRK భవన్ నుంచి GAD స్పెషల్ సీఎస్ అధర్ సిన్హా, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి, మరికొంతమంది అధికారులు…  ప్రభుత్వ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు

శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటేరియట్ లో, అధికారులు BRK భవన్ లో విధులు నిర్వహిస్తున్నారు.