ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్

ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్
  • ముగ్గురికి తీవ్రగాయాలు
  • సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో ఘటన

సంగారెడ్డి/మునిపల్లి, వెలుగు: ఆర్టీసీ బస్సుకు కరెంటు వైర్లు తగలడంతో ముగ్గురికి  తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు వివరాల ప్రకారం.. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మునిపల్లి చౌరస్తా మీదుగా బుదేరా నుంచి సదాశివపేటకు వెళుతోంది. మక్తక్యాసారం గ్రామంలో ప్రయాణికులతో పాటు స్టూడెంట్స్​ను ఎక్కించుకున్నారు. పిల్లలను మునిపల్లి చౌరస్తాలో దించాల్సి ఉండగా పక్కనే ఉండడంతో నేరుగా మోడల్​ స్కూల్​వరకు తీసుకెళ్లి దింపారు. అనంతరం డ్రైవర్ రివర్స్​తీసుకునే క్రమంలో విద్యుత్​వైర్లు బస్సును తాకాయి. దాంతో ఒక్కసారిగా బస్సు కింది భాగంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో దాదాపు 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది వెంటనే పవర్ సప్లై నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రుల్లో మన్సన్​పల్లి గ్రామానికి చెందిన స్టూడెంట్ గీత, పెద్దలోడికి చెందిన  స్టూడెంట్ జగన్, మన్సాన్​పల్లి నర్సింగ్ గౌడ్​ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఈ ముగ్గురిని ముందుగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​లోని కిమ్స్ కు తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్​షకీల్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మునిపల్లి ఎస్సై మహేశ్వర్​రెడ్డి చెప్పారు.

For More News..

మిస్డ్ కాల్‌‌ ఇస్తే లోన్ ఇస్తరట

రియల్టీలో మంచి ఆఫర్లు.. ఇల్లు కొనేద్దాం ఇప్పుడే!

ఐపీఎల్‌లో పేరు మార్చుకున్న పంజాబ్ జట్టు