- ముగ్గురిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు
- మరో ముగ్గురి నుంచి ఫారిన్ సిగరెట్లు స్వాధీనం
శంషాబాద్, వెలుగు: బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ప్యాసింజర్లను శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. యూఏఈలోని రాస్ అల్ ఖైమా ప్రాంతం నుంచి బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఓ ప్యాసింజర్ నుంచి కిలో 196 గ్రాములు, కువైట్ నుంచి శంషాబాద్ కు వచ్చిన ప్యాసింజర్ నుంచి 752 గ్రాములు, షార్జా నుంచి వచ్చిన మరో ప్యాసింజర్ నుంచి 221 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ముగ్గురి నుంచి మొత్తం 2 కిలోల 279 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు రూ.కోటి 37 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు కంబోడియా నుంచి బ్యాంకాక్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మరో ముగ్గురు ప్యాసింజర్ల నుంచి లక్ష ఫారిన్ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, ఫారిన్ సిగరెట్లను తరలించిన ఆరుగురిపై కస్టమ్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.