రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ పేరుతో మోసం

రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ పేరుతో మోసం

బషీర్​బాగ్, వెలుగు: రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ పేరుతో ఓ వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసాగించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి స్కామర్స్ టెక్స్ట్ మెసేజ్ పంపించారు. ఇండియన్ ఆయిల్ కు చెందిన రివార్డ్ పాయింట్స్ గడువు ముగియనుందని తెలిపారు. పాయింట్స్ ను క్లయిమ్ చేసుకోవాలంటే మెసేజ్ లో పంపిన లింక్ ను క్లిక్ చేయాలని సూచించారు. వృద్ధుడు లింక్ పై క్లిక్ చేశాడు. రూ.399 చెల్లిస్తే 10 వేల విలువైన అమెజాన్ వోచర్ ఇస్తామని నమ్మించాడు. బాధితుడు హెచ్ఎస్​బీసీ క్రెడిట్ కార్డు నుంచి రూ.399 చెల్లించాడు. ఆ సమయంలో వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగా రూ.లక్షా 28 వేలు డెబిట్ అయ్యాయి.