సైబర్ క్రైమ్ నోటీసులపై బీజేపీ ఆందోళన

సైబర్ క్రైమ్ నోటీసులపై బీజేపీ ఆందోళన

తెలంగాణ కొత్త సచివాలయ ప్రమాద ఘటన, ఎమ్మెల్సీ కవిత పోస్టుపై బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బషీర్ బాగ్‭లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తెలంగాణ నూతన సచివాలయం అగ్నిప్రమాద ఘటనపై, ఎమ్మెల్సీ కవిత పోస్టులపై సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేశారని.. బీజేపీ కార్యకర్తలకు సైబర్ క్రైం పోలీసులు నోటీసులు అందజేశారు.

సచివాలయంలో క్షుద్రపూజలు చేశారంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన కరీంనగర్‭కు చెందిన పరందామయ్య పై కేసు నమోదు చేశారు. దీనిపై బీజేపీ నాయకులు పోలీసులపై ఫైర్ అయ్యారు. పరందామయ్యను అక్రమంగా హైదరాబాద్ తీసుకొచ్చి నోటీసులు ఇచ్చారని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. పరందామయ్య పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.