- సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
బషీర్ బాగ్, వెలుగు: ఇన్వెస్ట్ మెంట్ పేరుతో సిటీకి చెందిన ముగ్గురి నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా డబ్బు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ముగ్గురు వేర్వేరు వ్యక్తులు పార్ట్ టైమ్ జాబ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. కొన్ని నంబర్లకు కాల్ చేశారు. కాల్ రిసీవ్ చేసుకున్న అవతలి వ్యక్తులు.. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువగా లాభాలు వస్తాయని వీరిని నమ్మించారు.
ఇలా ముగ్గురి నుంచి రూ.35 లక్షలను అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన ముగ్గురు బాధితులు శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.