
సైబర్ క్రైమ్ రోజు రోజుకూ పెరుతుందని.. అందుకే జోన్కు ఒక సైబర్ సెల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. జీఓ 50 ద్వారా జోనల్ సైబర్ సెల్స్ (ZCC) ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
హైదరాబాద్ మహానగరంలో ఒక్క సైబర్ క్రైమ్ స్టేషన్ మాత్రమే ఉందని.. సైబర్ క్రైమ్ పెరుగుతున్న క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకోసమే ప్రతి పిటిషన్ ని దర్యాప్తు చేసేందుకు ZCC సిస్టమ్ ను తీసుకొచ్చినట్లు తెలిపారు.
హైదరాబాద్ లో 2015లో 351 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని.. కానీ గత సంవత్సరం (2024) 3,111 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.
సైబర్ క్రైమ్ లో 35 రకాల కేసులు నమోదు అవుతున్నాయని.. వాటిన్నింటిని గుర్తించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కేసులు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. కేసులు పెరుగుతున్న క్రమంలో 7 జోన్ లలో ZCC ని తీసుకోచ్చినట్లు చెప్పారు.
ZCC పని తీరు, పని భారాన్ని బట్టి సైబర్ క్రైమ్ స్టేషన్స్ త్వరలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి స్టేషన్ లో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయడం వీలుకాదన్న సీపీ.. డీసీపీ కార్యాలయాల్లో జోనల్ డీసీపీ పర్యవేక్షణలో ఇవి నడుస్తాయని చెప్పారు.
ప్రతి జోన్ లో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ZCC టీమ్ లో ఒక ఎస్సై, 5గురు కానిస్టేబుల్స్, ఇద్దరు హోం గర్డ్స్ ఉంటారని తెలిపారు. వృత్తిరీత్యా టెక్నికల్ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్లను ZCC లోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి.. టెక్నికల్ పరిజ్ఞానం పొందిన తర్వాతే సిబ్బందిని కేటాయించినట్లు సీపీ చెప్పారు.