పెళ్లి డబ్బులు కాజేసిన సైబర్ కేటుగాళ్లు

పెళ్లి డబ్బులు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
  • పెళ్లి డబ్బు కాజేసిన సైబర్ దొంగలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

పరిగి, వెలుగు: తన అక్క పెళ్లి కోసం ఓ యువకుడు బ్యాంకులో దాచుకున్న లక్ష రూపాయలను సైబర్​నేరగాళ్లు కొట్టేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నిఖిల్ తన అక్క పెళ్లి కోసం ఇండియా పోస్ట్​పేమెంట్​బ్యాంకులో లక్షా2వేలు దాచాడు. ఇటీవల బ్యాంకు టోల్​ఫ్రీ నంబర్​కోసం నెట్​లో సర్చ్​చేశాడు. ఆన్​లైన్​లో దొరికిన నంబర్​కు కాల్​చేయగా స్పందన లేదు. తర్వాత నిఖిల్ కు ఒక ఫోన్​కాల్​వచ్చింది. ఎనీ డెస్క్​అనే యాప్​డౌన్​లోడ్​చేసి లింక్​క్లిక్​చేస్తే ఇన్ఫర్మేషన్​వస్తుందని చెప్పడంతో నిఖిల్​అలానే క్లిక్​చేశాడు. ఆ వెంటనే నిఖిల్​బ్యాంక్​అకౌంట్​లోని లక్షా2వేలు మాయం అయ్యాయి. గుర్తించిన యువకుడు సైబర్ పీఎస్​లో కంప్లయింట్​​చేశాడు.