- పెళ్లి డబ్బు కాజేసిన సైబర్ దొంగలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
పరిగి, వెలుగు: తన అక్క పెళ్లి కోసం ఓ యువకుడు బ్యాంకులో దాచుకున్న లక్ష రూపాయలను సైబర్నేరగాళ్లు కొట్టేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నిఖిల్ తన అక్క పెళ్లి కోసం ఇండియా పోస్ట్పేమెంట్బ్యాంకులో లక్షా2వేలు దాచాడు. ఇటీవల బ్యాంకు టోల్ఫ్రీ నంబర్కోసం నెట్లో సర్చ్చేశాడు. ఆన్లైన్లో దొరికిన నంబర్కు కాల్చేయగా స్పందన లేదు. తర్వాత నిఖిల్ కు ఒక ఫోన్కాల్వచ్చింది. ఎనీ డెస్క్అనే యాప్డౌన్లోడ్చేసి లింక్క్లిక్చేస్తే ఇన్ఫర్మేషన్వస్తుందని చెప్పడంతో నిఖిల్అలానే క్లిక్చేశాడు. ఆ వెంటనే నిఖిల్బ్యాంక్అకౌంట్లోని లక్షా2వేలు మాయం అయ్యాయి. గుర్తించిన యువకుడు సైబర్ పీఎస్లో కంప్లయింట్చేశాడు.