దేశంలో రెండో రోజూ 7వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో రెండో రోజూ 7వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మొన్నటివరకూ వందల్లో నమోదైన కేసులు.. మళ్లీ వేలల్లో రికార్డవుతున్నాయి.  దేశంలో గడిచిన 24 గంటల్లో 7584 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక శుక్రవారం వరకు కొవిడ్ పాజిటివిటీ రేటు 2.26శాతంగా రికార్డయింది. ప్రస్తుతం 36 వేల 267 కరోనా కేసులు యాక్టివ్ లో ఉండగా.. ఒక్కరోజులో 24 మరణాలు నమోదైనట్టు తెలుస్తోంది. దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో అంతటా టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ నాలుగో వేవ్ కూడా వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మునుపటి స్థితి రాకముందే మళ్లీ కరోనా జాగ్రత్తలు ఫాలో కావాలని.. మాస్క్ ధరించాలని ఇప్పటికే రాష్ట్రాలకు, కేంద్రం పలు సూచనలు చేసింది.