కేసీఆర్ గొప్ప నాయకుడే.. వాళ్లే బ్రష్టు పట్టించారు: దానం నాగేందర్

కేసీఆర్ గొప్ప నాయకుడే.. వాళ్లే బ్రష్టు పట్టించారు: దానం నాగేందర్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  గొప్ప నాయకుడు.. కాని, ఆయన పక్కన ఉన్న వాళ్లే కేసీఆర్ ను బ్రష్టు పట్టించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.‌ సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళ్తానని దానం అన్నారు. తన అభ్యర్థిత్వంపై కేటీఆర్ న్యాయస్థానానికి వెళితే తాను న్యాయస్థానంలోనే సమాధానం చెప్తానని అన్నారు. వాళ్లు చేసింది కరెక్ట అయితే.. ఇప్పుడు జరుగుతున్నది కూడా కరెక్టే అన్నారు.  ముఖ్యమంత్రిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని.. మూడు నెలల్లో ముఖ్యమంత్రి రూ.3500 కోట్లు సంపాదిస్తే.. 10 సంవత్సరాలలో వాళ్లు ఎన్ని సంపాదించి ఉండొచ్చని ప్రశ్నించారు.

తాను ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారినట్లు వస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు దానం. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత తాను ఆస్తులు కూడా పెట్టినట్టు చూపిస్తే అంతా వదులుకునేందుకు సిద్ధమని సవాల్ చేశారు. టీఆర్ఎస్ లో ఓ కార్యకర్తలాగానే పని చేశానని, ఇప్పుడు ఓ కార్యకర్తలాగానే పని చేస్తూ ఎంపీగా పోటీకి సిద్ధమైనట్లు ప్రకటించారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో తనదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.