గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థులను ఎంపిక చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రావులను ఖరారు చేస్తూ గవర్నర్ కు పంపించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గవర్నర్ కు పంపించిన తర్వాత ఆమోదించాల్సిందేనన్నారు. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ 1999లో సంగారెడ్డి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు .
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ దాదాపు ఆరుగంటల పాటు కొనసాగింది. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఆగస్టు 3 నుంచి జరిగే సమావేశాల్లో పెడతామని చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది