రేవంత్ రైతుల పాలిట రాబందు: దాసోజు శ్రవణ్

రేవంత్ రైతుల పాలిట రాబందు: దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాబందుగా మారిండని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రైతులకు రైతుబంధు సాయం అందకుండా కాంగ్రెస్ నేతలే ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. వచ్చే నెల 3న మళ్లీ బీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ సీఎం అయిన వెంటనే రైతులకు రైతుబంధు సాయం అందజేస్తామని తెలిపారు. కుటిల రాజకీయాలు చేస్తోన్న కాంగ్రెస్‌‌కు కర్రుకాల్చి వాత పెట్టాలని కోరారు. 

రైతుబంధు ఆపేయాలని కోరుతూ గతంలోనే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి సీఈసీకి ఫిర్యాదు చేశారని, ప్రభుత్వ విజ్ఞప్తితో ఈసీ అనుమతి ఇచ్చినా కాంగ్రెస్ నేత నిరంజన్​రెడ్డి ఫిర్యాదు చేసి అడ్డుకున్నారని తెలిపారు. వాళ్ల చిల్లర రాజకీయాల కోసం రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు.