హైదరాబాద్, వెలుగు: ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం తిరిగి ఇస్తానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడటం చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని బీఆర్ఎస్నేత దాసోజు శ్రవణ్కుమార్అన్నారు. ఆయనకు అడ్డూఅదుపు లేని స్వేచ్ఛ ఉంది కాబట్టే కేసీఆర్ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసినా.. జైల్లో ఉండకుండా బయట తిరుగుతున్నారన్నారు.
బూతులు తిట్టడానికి స్వేచ్ఛ కావాలా.. రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికా.. భూకబ్జాలు చేయడానికా.. ఇంకా ఏం సెటిల్మెంట్లు చేయడానికి స్వేచ్ఛ కావాలో ప్రజలకు చెప్పాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
బ్లాక్ మెయిల్ దందాలు, సెటిల్మెంట్లు, ఆర్టీఐ అప్లికేషన్లు, మోసాలు చేస్తూ మాఫియాలా రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీసీ, దళిత, గిరిజన, మైనార్టీ లీడర్లను అణచివేస్తూ, చిల్లర రాజకీయాలు చేస్తూ సీట్లు అమ్ముకుంటున్న రేవంత్ను ఎన్నికల్లో ఓడించి, అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వబోమని హెచ్చరించారు.