
దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దుర్గాదేవిని పూజించి..తొమ్మిది రోజుల పాటు.. రోజుకొక అవతారంలో ఆవాహనచేసి పూజలు చేస్తారు. కొంతమంది నవరాత్రి సమయంలో దీక్షలు చేస్తారు. చాలామంది ఉసవాసం చేస్తుంటారు. అయితే ఇలా ఉపవాసం ఉండే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
హిందువులు దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో బతకమ్మ ఆడుతూ.. ఎంతో నిష్టగా పూజలు చేస్తుంటారు. గురుముఖంగా నవరాత్రి దీక్ష తీసుకొని ఉపవాసం ఉంటారు. అలాంటి వారు ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉపవాస దీక్ష పాటించే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని.. నిపుణుల సలహాలు తీసుకోవాలి.
ALSO READ | తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశాలు
హిందూ మతంలో దసరా పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమ్మవారిని పూజించడం.. ఉపవాస దీక్షలు చేయడం సంప్రదాయంగా పాటిస్తారు. ఉపవాసం చేయడం మతానికి సంబంధించిన విషయమే కాదు.. ఆరోగ్య పరంగా కూడా చాలా మంచిది. అయితే కొన్ని సరైన ద్దుతుతు పాటిస్తూ ఉసవాస దీక్ష చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
- ఉపవాస సమయంలో శరీరం డీ హైడ్రేడ్ కాకుండా... తగినంత నీరు తాగాలి.
- శరీరం డీహైడ్రేడ్ గా ఉంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అలానే ఉంటుంది.
- చాలామంది అల్పాహారం తీసుకుంటారు.. అలాంటి వారు ఆయిల్ ఫుడ్ అసలు తీసుకోకూడదు.
- మధుమేహం, కొలెస్ట్రాల్ ఉన్నవారు నూనెతో తయారు చేసిన పదార్ధాలు తింటే.. చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది.
- బత్తాయి పండ్లు, జామ పండ్లు తినాలి. యాపిల్స్, అరటిపండ్లను మాత్రం షుగర్ ఉన్నవారు ఒక పండు మించి తినరాదు.
- ఉపవాసం ఉండే వారు ఎక్కువ సేపు పొట్టను ఖాళీగా ఉంచవద్దు. అలా ఉంచడం వల్ల గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది
- ప్రతి 2 నుంచి మూడు గంటలకు ఏదో ఒకటి తినాలి. అంటే ఆకలి లేకుండా ఉండాలి. కొంతమంది అలానే ఉంటారు. వారు ఎసిడిటీ, తలనొప్పి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది
- అలసట రాకుండా.. మంచినీరు.. పండ్ల రసాలు తీసుకోవాలి.
- తొమ్మదిరోజులు ఉపవాసం ఉండేవారు ప్రోటీన్స్ తో ఉన్న పదార్దాలను తినాలి.
- పెరుగు, పాలు, బాదం వంటి పదార్దాలను తినండి. ఇవి తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
- తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్స్ తినండి. తినే ఆహారంలో చీజ్, పెరుగు, పాలు, బాదం వంటి వాటిని చేర్చుకోండి. వీటిని తినడం వలన చాలా శక్తిని పొందుతారు ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. దీంతో కడుపుని చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది.
- బీపీ. షుగర్ క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నావారు.. గర్భిణీ స్త్రీలు ఉసవాసం ఉండకూడని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.