తపాస్ పల్లి నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలి : చిట్టి దేవేందర్ రెడ్డి

తపాస్ పల్లి నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలి : చిట్టి దేవేందర్ రెడ్డి
  •     డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి

కొండపాక, వెలుగు : తపస్ పల్లి డీ 4 కాల్వల  ద్వారా కొండపాక మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డీసీసీబీ చైర్మన్​ చిట్టి దేవేందర్​రెడ్డి కోరారు. కొండపాక పీఏసీఎస్​లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటిని అందించకుంటే మండలంలోని రైతులందరితో కలిసి ధర్నా చేపడతామన్నారు.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తిమ్మారెడ్డిపల్లి లో నిర్మించాల్సిన ప్రాజెక్టును కుట్రతో తపస్​పల్లికి తరలించడంతో కొండపాక మండలానికి అన్యాయం జరిగిందన్నారు. నీరందక వరి ఎండిపోతుందటూ ఆవేదన వ్యక్తం చేశారు. పీఏసీఎస్​డైరెక్టర్లు పిస్కా అమరేందర్, సురేందర్​రావు, నరసింహ చారి,శంభు పాల్గొన్నారు.