
ధర్మసాగర్(వేలేరు), వెలుగు: వేలేరు పోలీస్ స్టేషన్ ను సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆదివారం సందర్శించారు. స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలు, సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి, వివరాలపై ఆరా తీశారు. అనంతరం పీఎస్ ఆవరణలో మొక్క నాటి, నీరు పోశారు. ధర్మసాగర్ సీఐ ప్రవీణ్, వేలేరు ఎస్సై అజ్మీర సురేశ్, సిబ్బంది ఉన్నారు.