తమిళనాడులో ఒక్క సారిగా 50 కాకులు, 3కుక్కలు మృతి

తమిళనాడులో ఒక్క సారిగా 50 కాకులు, 3కుక్కలు మృతి

తమిళనాడులోని నాగపట్టణం జిల్లా పూంపుహార్‌ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిన్న(గురువారం) ఉన్నట్టుండి ఒక్కసారిగా 50 కాకులు, మూడు కుక్కలు మృతి చెందడమే దీనికి కారణం. ప్రస్తుతం కరోనా వైరస్ తో భయపడుతున్న ప్రజలు ఈ ఘటనతో మరింత భయాందోళనకు గురయ్యారు.

డాగ్స్, కాకుల మృతి చెందిన విషయాన్ని గ్రామాధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేశారు. అధికారులు చనిపోయిన శునకాలు, కాకుల నుంచి నమూనాలు సేకరించారు. పరీక్షల తర్వాత అవి చనిపోవడానికి గల కారణాలను తెలుపుతామన్నారు. మరోవైపు.. వీటిపై విష ప్రయోగం జరిగిందా? అనే విషయమై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జంతువులకు కూడా కరోనా వైరస్ సోకుతోందన్న వార్తలు వస్తున్న క్రమంలో  వీటి మృతితో స్థానికులు మరింత భయాందోళనకు లోనయ్యారు.