దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. లాక్ డౌన్ ప్రకటించినా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఒక్కరోజులోనే దాదాపు నిన్న(26న)100 కేసులు నమోదయ్యాయి. ఇక శుక్రవారం ఉదయం వరకు భారత్ లో 724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 66 మంది డిశ్చార్జ్ అయ్యారని..17 మంది చనిపోయారని ప్రకటించింది.
అత్యధికంగా కేరళలో 137 , మహారాష్ట్రలో 130, కర్ణాటక 55, తెలంగాణ 45, రాజస్థాన్ 45 పాజిటివ్ కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ లో 43, ఉత్తరప్రదేశ్ లో 41, ఇక ఏపీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Total number of #Coronavirus positive cases in the country rises to 724 (including 66 cured/discharged persons and 17 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/MHlRtSp7oG
— ANI (@ANI) March 27, 2020