కోర్టు ఆర్డర్ ఉన్నా.. డెక్కన్ కిచెన్ ను కూల్చేసిన్రు

కోర్టు ఆర్డర్ ఉన్నా.. డెక్కన్ కిచెన్ ను కూల్చేసిన్రు
  • సినీ నిర్మాత దగ్గుబాటి  సురేశ్ తో పాటు కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నందకుమార్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫిల్మ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెక్కన్ కిచెన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీ ప్రొడ్యూసర్ దగ్గుపాటి సురేశ్ బాబు, హీరో వెంకటేశ్, రానా, అభిరామ్‌‌‌‌‌‌‌‌పై ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ కేసు నిందితుడు నందకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డెక్కన్ కిచెన్ హోటల్‌‌‌‌‌‌‌‌ను కూల్చివేయడంపై చర్యలు తీసుకోవాలని కోరాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

సురేశ్ బాబు, వెంకటేశ్, రానా, అభిరామ్‌‌‌‌‌‌‌‌.. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై తన హోటల్‌‌‌‌‌‌‌‌ని కూల్చివేయించారని నందకుమార్ ఆరోపించాడు. 60 మంది ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకుని కూల్చివేతలు చేశారన్నారు. డెక్కన్ కిచెన్ కూల్చేయడంతో రూ .20 కోట్లు నష్టపోయానని పోలీసులకు తెలిపాడు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు.