న్యూఢిల్లీ: రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ నటించబోయే సినిమా ఆల్రెడీ కన్ఫమ్ అయిన సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటితో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నాగ్ అశ్విన్ డైరెక్షన్లో డార్లింగ్ మూవీ ఖాయమైంది. అయితే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్, మిగతా కాస్టింగ్ వివరాలను మూవీ యూనిట్ చెప్పలేదు. తాజాగా ఈ ఫిల్మ్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెల్లడించింది. ప్రభాస్ సరసన్ బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పడుకొనే నటించనుందని సినిమాను నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ ప్రకటించింది.
As promised, here it is – our next big announcement! WELCOMING THE SUPERSTAR ♥️https://t.co/QqWERCVywC#Prabhas @deepikapadukone @nagashwin7 @vyjayanthifilms #Prabhas21 #DeepikaPrabhas
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2020
ప్రొడక్షన్ హౌజ్ను మొదలుపెట్టి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసిన వైజయంతీ మూవీస్ అందులో ప్రభాస్, దీపికా పడుకోన్, నాగ్ అశ్విన్కు వెలకమ్ చెప్పింది. స్కైఫై సబ్జెక్ట్తో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగుతోపాటు దక్షిణాదిన దీపిక యాక్ట్ చేయనున్న ఫస్ట్ ఫిల్మ్ ఇదే కానుంది. ప్రభాస్తో ఈ సినిమాను రూపొందించడంపై తాము గర్వంగా ఉన్నామని వైజయంతీ మూవీస్ పేర్కొంది. సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది.