తిరుమల శ్రీవారి సేవలో.. దీపికా పదుకొణె, దగ్గుబాటి కుటుంబ సభ్యులు

తిరుమల శ్రీవారి సేవలో.. దీపికా పదుకొణె, దగ్గుబాటి కుటుంబ సభ్యులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బాలీవుడ్‌ స్టార్‌ నటి దీపికా పదుకొణె దర్శించుకున్నారు. శుక్రవారం (డిసెంబర్ 15న) ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నటికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనార్థం దీపికా అలిపిరి మెట్లమార్గం ద్వారా కాలినడకన గురువారం (డిసెంబర్ 14న) రాత్రి కొండపైకి చేరుకున్న విషయం తెలిసిందే. రాత్రి తిరుమలలోనే బస చేసి.. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆమె శ్రీవారిని‌ దర్శించుకున్నారు.

మరోవైపు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ కుటుంబ సభ్యులు కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సురేశ్‌ దంపతులతోపాటు కొత్త జంట దగ్గుబాటి అభిరామ్‌ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలోనే వీరు కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు.