ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలకమైన ఆధారాలు లభించాయి. పేలుడుకు ముందుకు మానవ బాంబు గా భావిస్తున్న డాక్టర్ నబీ కారు ఏయే ప్రాంతాల్లో తిరిగింది.. ఎక్కడెక్కడ పార్కింగ్ చేశారు.. వంటి విషయాలతో పాటు ఘటనాస్థలంలో ప్రత్యేక బుల్లెట్లు దొరకడం కలకలం రేపుతోంది..
ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. పేలుడు జరిగిన ప్రదేశంలో మూడు 9 mm స్పెషల్ బుల్లెట్లు లభించారు. క్వాలబర్ కాట్రిడ్జ్ లను సీజ్ చేశారు. వీటిలో రెండు లైవ్ కాట్రిడ్జ్ లు, ఒకటి ఖాలీ షెల్.. అ బుల్లెట్లను భద్రతాదళాలు, ప్రత్యేక అధికారులు మాత్రమే వీటిని ఉపయోగిస్తారు. అయితే ఘటనా స్థలంలో ఎటువంటి పిస్టల్ లభించలేదు. స్పాట్ లో ఉన్న అందరు అధికారుల బుల్లెట్లు తనిఖీ చేశారు. ఆ బుల్లెట్లు ఏ అధికారివి కావు. ఈ బుల్లెట్లు ఘటనా స్థలానికి ఎలా వచ్చాయనే కోణంలో పరిశీలిస్తున్నారు. పేలుడు సమయంలో లేదా తర్వాత అవి కారునుంచి పడిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
జైషే మహ్మద్ నిధులు జాడ తెలిసింది..
ఉమర్ ముజమ్మిల్, షాహీన్ ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన రూ. 20 లక్షల నగుదుకు సంబంధించి నిధుల జాడ నిఘా వర్గాలు కనిపెట్టాయి. జైష్ ఏ మహ్మద్ హ్యాండ్లర్ హవాలా నెట్ వర్క్ ద్వారా ఈ డబ్బును వీరికి మళ్లించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఉగ్రవాదులకు లభించిన నిధులతో వ్యవసాయ ఎరువులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నత్రజని, భాస్వరం, పొటాషియం, ఆధారంగా ఉంటే కెమికల్స్ ను కొనుగోలు చేసేందుకు ఖర్చు చేసినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వీటితో పేలుడు పదార్థాలను కూడా తయారు చేయొచ్చు.
అయితే డబ్బు విషయంలో డాక్టర్ నబీ, డాక్టర్ షాహీన్ మధ్య విభేదాలు తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. ముజమ్మిల్ విచారణలో ఆర్థిక లావాదేవీల సంబంధించిన కీలక సమాచారం రాబట్టినట్లు చెప్పారు.
