మిచెల్​ మార్ష్‌‌‌‌కు పాజిటివ్‌‌

మిచెల్​ మార్ష్‌‌‌‌కు పాజిటివ్‌‌
  • హాస్పిటల్​లో చేరిన ఆల్​రౌండర్  ​  
  • ఢిల్లీ టీమ్​లో ఐదుగురికి కరోనా

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో కరోనా కలకలం రేపింది. ఆస్ట్రేలియా ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌ సహా ఐదుగురు కరోనా బారిన పడ్డారు. ఇందులో ఫిజియో ఫర్హాత్​, టీమ్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ అభిజిత్‌‌‌‌‌‌‌‌ సాల్వి కూడా ఉన్నారు. జ్వరంతో పాటు ఇతర లక్షణాలు ఉండటంతో మార్ష్​ను హాస్పిటల్​లో చేర్చారు. మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవు. స్వల్ప లక్షణాలు ఉండటంతో మొదట మార్ష్‌‌‌‌‌‌‌‌కు ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయగా పాజిటివ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన మెడికల్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 

తొలి పరీక్షలో మార్ష్ కు నెగెటివ్‌‌‌‌‌‌‌‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ రెండో ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా  తేలింది. ఫలితంగా పది రోజుల పాటు మార్ష్‌‌‌‌‌‌‌‌ ఆటకు దూరంగా ఉండనున్నాడు. అయితే, మిగతా ప్లేయర్లంతా  నెగెటివ్‌‌‌‌‌‌‌‌గా తేలడంతో పుణెలో  బుధవారం పంజాబ్‌‌‌‌‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ప్రకారమే ఉండే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. సోమవారమే ఢిల్లీ టీమ్‌‌‌‌‌‌‌‌ పుణెకు బయల్దేరాల్సి ఉన్నా.. ప్రస్తుతానికి హోటల్‌‌‌‌‌‌‌‌ రూమ్స్‌‌‌‌‌‌‌‌కే పరిమితమైంది. మంగళవారం వచ్చే ఆర్​టీపీసీఆర్​ టెస్ట్​ రిపోర్ట్స్​ను బట్టి వెళ్లే చాన్స్​ ఉంది.