న్యూఢిల్లీ: పంజాబ్లో అద్భుత విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని ఆప్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇకపోతే, పంజాబ్ లోని జలంధర్ కు చెందిన హర్భజన్ 1998 నుంచి 2016 వరకు టీమిండియా సభ్యుడిగా ఉన్నాడు. దేశం తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడిన భజ్జీ.. ఐపీఎల్లో 163 మ్యాచ్లు ఆడాడు. గతేడాది డిసెంబర్లో క్రికెట్కు అల్విదా చెప్పిన ఈ ఆఫ్ స్పిన్నర్.. రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడని వార్తలు వినిపించాయి. పంజాబ్కు సేవ చేయాలని ఉందని చెప్పిన భజ్జీ.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయితే స్వయంగా తానే ప్రకటిస్తానని చెప్పాడు. అయితే అతడి నుంచి ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
AAP likely to send cricketer Harbhajan Singh to Rajya Sabha
— ANI Digital (@ani_digital) March 16, 2022
Read @ANI Story | https://t.co/gAPDOIEbtM#HarbhajanSingh #Punjab #AAP pic.twitter.com/m0jwaoKVVs
మరిన్ని వార్తల కోసం: