ఢిల్లీ లిక్కర్ స్కాం : సిసోడియా సీబీఐ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం : సిసోడియా సీబీఐ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై  రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. ఆర్డర్ ను రిజర్వు చేస్తూ.. తదుపరి విచారణను మార్చి10కి వాయిదా వేసింది. దాంతో పాటు సిసోడియా సీబీఐ కస్టడీని మరో రెండు రోజులకు పొడిగిస్తూ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు సిసోడియా రిమాండ్‌ను మూడు రోజులు పొడిగించాలని సీబీఐ కోరగా... ఆయన తరఫు సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ సీబీఐ దరఖాస్తును వ్యతిరేకించారు. దర్యాప్తును పూర్తి చేయడంలో సీబీఐ అసమర్థత రిమాండ్‌కు కారణం కాదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనను సీబీఐ అధికారులు మానసికంగా వేధిస్తున్నారని సిసోడియా కోర్టుకు వెల్లడించారు. దీంతో సిసోడియాను అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగి అతన్ని అడగొద్దంటూ కోర్టు ఆదేశించింది.