న్యూఢిల్లీ: ఏఐ సమిట్ లో కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శనను ఢిల్లీ కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇది శాంతిభద్రతలపై జరిగిన దాడి అని, భారత దౌత్య ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానించింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలను విచారణ కోసం ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు శనివారం అనుమతించింది.
వారు పరారీలో ఉండే అవకాశం ఉందని, విదేశీ కుట్రలతో సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టు పేర్కొంది.
