లిక్కర్​ స్కామ్​ కేసులో సిసోడియా పీఏ అరెస్టు

లిక్కర్​ స్కామ్​ కేసులో సిసోడియా పీఏ అరెస్టు
  • లిక్కర్​ స్కామ్​ కేసులో సిసోడియా పీఏ అరెస్టు
  • దర్యాప్తునకు సహకరించడం లేదన్న ఈడీ అధికారులు
  • బీజేపీకి గుజరాత్​లో ఓటమి భయం పట్టుకుందని సిసోడియా ట్వీట్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా పీఏని ఈడీ అరెస్ట్​ చేసింది. అతడు దర్యాప్తునకు సహకరించడం లేదంటూ అదుపులోకి తీసుకుంది. శనివారం ఈడీకి చెందిన ప్రత్యేక బృందం ఈస్ట్​ ఢిల్లీ మండవ్లీలోని సిసోడియా పీఏ దేవేంద్ర శర్మ అలియాస్ రింకూ ఇంట్లో తని ఖీలు చేసింది. ఢిల్లీ ఎక్సై జ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్​ జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించింది. అయితే దర్యాప్తు సమయంలో రింకూ సహకరించకపోవడంతో అతడిని అరెస్ట్​ చేసింది. లిక్కర్​ స్కామ్​ కేసులో ఇప్పటి దాకా ఈడీ వందకు పైగా రైడ్స్​ చేసింది. ఆప్​ మంత్రి సత్యేంద్రజైన్, ఎమ్మెల్యే దుర్గేశ్​ పాఠక్​లను విచారించి అరెస్ట్​ చేసింది.

ఒక్క ఆధారం దొరకలేదనే అరెస్ట్: సిసోడియా

తన పీఏ రింకూను ఈడీ అరెస్ట్​ చేసిందంటూ మనీశ్​ సిసోడియా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి భయం పట్టుకుందని ఆరోపించారు. ‘‘తప్పుడు ఎఫ్ఐఆర్​ను నమోదు చేసి నా ఇంట్లో సోదాలు చేశారు. బ్యాంక్​ లాకర్లు తనిఖీ చేశారు. మా గ్రామానికి కూడా వెళ్లారు. అయినా వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ రోజు నా పీఏ ఇంట్లో సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. అందుకే ఇప్పుడు అతడిని అరెస్ట్​ చేసి తీసుకువెళ్లిపోయారు. బీజేపీ నేతలు ఎన్నికల్లో ఓడిపోతామని చాలా భయపడుతున్నారు”అని హిందీలో ట్వీట్​ చేశారు.