
అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ బార్డర్లలో ఆందోళన చేస్తున్న రైతులు తమ నిరసనను మరింత తీవ్రం చేశారు. అందులో భాగంగా ‘చక్కా జామ్’ పేరుతో నేడు దేశవ్యాప్తంగా రోడ్లు, హైవేలను బ్లాక్ చేయనున్నారు . రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ తర్వాత రైతులు తలపెట్టిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. ప్రొటెస్ట్ సైట్లలో ఇంటర్నెట్ను బ్యాన్ చేసిందని, తమ డిమాండ్లను పట్టించుకోవట్లేదని కేంద్రం పై మండిపడిన సంయుక్త కిసాన్ మోర్చా ‘చక్కా జామ్’ కు పిలుపునిచ్చింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో చక్కా జామ్ లేదని బీకేయూ లీడర్ రాజేశ్ తికాయత్ చెప్పారు.
ఎంత సేవు?
దేశవ్యాప్తంగా 3 గంటలపాటు నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, ఇంటీరియర్ రోడ్లను దిగ్బంధం చేస్తామని సంయుక్త్ కిసాన్ మోర్చా వెల్లడించింది. శాంతి యుతంగా, అహింసా మార్గంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రోడ్ల దిగ్బంధం కొనసాగుతుందని తెలిపింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు ఒక నిమిషం పాటు వెహికల్స్ హారన్లను మోగించి కార్యక్రమం ముగిస్తామని చెప్పింది. తమ ఆందోళనల కారణంగా ఇబ్బందులు పడే ప్రయాణికులకు నీళ్లు, ఆహారం అందిస్తామని తెలిపింది. స్కూల్ బస్సులు, అంబులెన్స్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసులను అడ్డుకోబోమని స్పష్టం చేసింది.
భారీగా భద్రతా ఏర్పాట్లు
‘చక్కా జామ్’ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు బార్డర్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘాజీపూర్ నుంచి వెహికల్స్ ఢిల్లీవైపు రాకుండా మల్టీలేయర్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో సెక్యూరిటీ టైట్ చేశారు. భద్రతా బలగాలు ఢిల్లీని తమ అదుపులోకి తీసుకున్నాయి. మెట్రో స్టేషన్లు, కీలకమైన జంక్షన్లు, ఎర్రకోట, ITO సహా ఇతర ప్రభుత్వ ఆఫీస్ల దగ్గర భారీగా బలగాలను మోహరించారు. రైతులు ఆందోళన చేస్తున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం వంద మీటర్ల మేర బారికేడ్లు పెట్టారు. మూడంచల భద్రత ఏర్పాటు చేశారు. వాటర్ కెనాన్ వెహికిల్స్ డిప్లాయ్ చేశారు. 50వేల మంది ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ, రిజర్వ్ దళాలను ఢిల్లీ-NCR రీజియన్లో మోహరించారు. నిరసన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న 12 మెట్రో స్టేషన్లను మూసేశారు. అటు హర్యానా పోలీసులు కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
For More News..