V6 News

ఎక్స్ప్రెస్ రైళ్లను రామగుండంలో నిలపాలి

ఎక్స్ప్రెస్ రైళ్లను రామగుండంలో నిలపాలి

గోదావరిఖని, వెలుగు: బల్హార్షా నుంచి కాజిపేట మార్గంలో వెళ్లే పలు ఎక్స్​ప్రెస్​ రైళ్లను రామగుండం స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హాల్టింగ్ కల్పించాలని రైల్వే యూజర్స్​ కమిటీ మెంబర్​, కాంగ్రెస్​ లీడర్​అనుమాస శ్రీనివాస్​ కోరారు. బుధవారం సికింద్రాబాద్​ నుంచి రామగుండం రైల్వే స్టేషన్​కు వచ్చిన డివిజనల్​ కమర్షియల్​ మేనేజర్​ చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​ మాట్లాడుతూ నవజీవన్​, స్వర్ణజయంతి, గరీబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రథ్​, చెన్నై– -జోదాపూర్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లను రామగుండంలో నిలపాలని కోరారు.